రీట్రాన్స్‌ లోకేషన్ ద్వారా వృక్షాలను తిరిగి నాటిస్తున్నాం..

40
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లాలో వంద సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉన్న వృక్షాలను రీట్రాన్స్ లోకేషన్ ద్వారా తిరిగి నాటిస్తున్నాం అన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్య సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, వాటా ఫౌండేషన్ సహకారంతో రీ ట్రాన్స్ లొకేషన్ చేపట్టారు అధికారులు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో అధునాతన వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న వంద సంవత్సరాల పైన చరిత్ర ఉన్న( 4) పెద్ద పెద్ద వృక్షాలను రీ ట్రాన్స్ లొకేషన్ ద్వారా కెసిఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించి అక్కడ నాటిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఆదివారం ఆయన కె సి ఆర్ అర్బన్ ఎకో పార్కులో వృక్షాల రిట్రాన్స్ లొకేషన్ చేసిన చెట్లను పరిశీలించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహకారంతో వృక్షాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి పెకిలించి అలాగే తీసుకెళ్లి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో నాటించామని ఆయన వెల్లడించారు.

వందల సంవత్సరాల చరిత్ర ఉన్న వృక్షాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటిని ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి తొలగించి కెసిఆర్ పార్క్ లో నాటించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, రాఘవ లకు జిల్లా ప్రజలు కృతజ్ఞత లు తెలుపుతున్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు నేతృత్వంలో విజయవంతంగా పెద్ద పెద్ద వృక్షాల ను రీ ట్రాన్స్లోకేషన్ చేసి కె సి ఆర్ అర్బన్ ఎకో పార్క్ లో నాటించటం లో కృషి చేసిన ప్రజారోగ్య ఈ ఈ విజయ భాస్కర్ ఇతర ఇంజనీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు. డిసిసిబి ఉపాధ్యక్ష్యులు కొరమోని వెంకటయ్య,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్ష్యులు రాజేష్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -