నర్సన్న మృతి పట్ల ఎంపీ సంతోష్ తీవ్ర దిగ్బ్రాంతి..

238
santhosh kumar
- Advertisement -

మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మృతి పట్ల ఎంపీ సంతోష్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీనియర్ నేతను కొల్పోయిందని..సీఎం కేసీఆర్ ముద్దుగా నర్సన్న అని పిలుచుకునే వారని గుర్తు చేశారు. నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సంతోష్…ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మృతిపై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమం, పార్టీ, ప్రభుత్వంలో నాయినితో తాను కలిసి పని చేశానని గుర్తు చేశారు.

నాయిని నర్సింహారెడ్డి మృతిపై రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, పార్టీకి, కార్మిక లోకానికి తీరని లోటన్నారు.

- Advertisement -