‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

390
Mp Santhosh Kumar
- Advertisement -

మాదాపూర్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌ను సంతోష్‌ కుమార్‌ ఆసక్తిగా తిలకించారు. వన్యప్రాణులే ఇతివృత్తంగా 11ఏళ్ల బాలుడు చిత్రలేఖనంతో అబ్బురపరిచాడు. సృజనాత్మకతతో బొమ్మలు గీసిన యువ చిత్రకారుడు ప్రణవ్‌ను ఎంపీ సంతోష్‌ అభినందించారు.

Santhosh kumar Joginaplli

ఎగ్జిబిషన్‌ లో ప్రదర్శనకు ఉంచిన పెయింటింగ్స్‌ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును పేద పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం సహాయ నిధికు కి అందజేస్తామని ప్రణవ్‌ తెలిపారు. అటు ఎగ్జిబిషన్‌ ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ కు ప్రణవ్‌ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ మాదాపూర్‌ లోని స్టేట్‌ ఆర్ట్స్‌ గ్యాలరీలో రెండు రోజుల పాటు జరుగనుంది.

- Advertisement -