వలస జీవులకు ఎంపీ సంతోష్ సాయం..

337
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో కొనసాగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ… ఒక వైపు కరోనా మహమ్మారి విలయతాండవం, మరో వైపు లాక్ డౌన్ సందర్బంగా వలస జీవుల విగత బతుకులు, ఎన్ని సమస్యలు ఎదురైనా, సామాన్య మనువుని ఆకలి ఏడుపులు రాష్ట్రంలో వినిపించద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్తకంఠంతో పదే పదే ప్రజాప్రతినిధులను,అధికారులను కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (సంతన్న) ఆదేశాలతో ఈ రోజు బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో 30 మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికి 10కేజీల బియ్యం కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు సంతన్న అభిమానులు ఇవ్వడం జరిగినది.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అనుముల భాస్కర్,పేంతల బాల్ రెడ్డి, చెంచు సంపత్, కొనుకటి తిరుపతి, కొండం నారాయణ రెడ్డి, ఉమ్మారెడ్డి అనిల్ రెడ్డి, గూడ బాల కిషన్, సింగిరెడ్డి బలమల్లు, ఎర్ర నాగరాజు, కొనుకటి బాల్ రెడ్డి, ఎర్ర మల్లయ్య, గూడ మధుకర్, ఆవుల మల్లయ్య, అనుముల రాజు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -