పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్న ఎంపీ సంతోష్..

198
mp santhosh
- Advertisement -

కష్ట కాలంలో పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్. బోయినిపల్లిమండలం కోదురుపాక తన స్వంత గ్రామంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 8వ రోజుకు చేరింది. బుధవారం సుమారు 100 మంది వలస కార్మికులు భోజనాలు చేశారు.

mp santhos food camp

ఈ క్యాంప్ లాక్‌డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనాలు పెడతామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు తెలిపారు. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, టీఆర్‌ఎస్‌ నయాకులు ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, గుండ్ల సాయబు పాల్గొన్నారు.

- Advertisement -