గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో అన్నదానం..

199
Green India Challenge
- Advertisement -

లాక్ డౌన్‌లో భాగంగా పేదలు ఎవరు ఆకలితో బాధపడకూడదు అన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బోరబండ డివిజన్‌లో సైట్-3 వికర్స్ సెక్షన్‌లో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సంర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, సభ్యులు కిషోర్ గౌడ్ లు పేదలకు ఉచిత భోజనం పంపిణీ చేశారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ఉచిత భోజన కార్యమాన్ని కొనసాగిస్తామని కో ఫౌండర్ రాఘవ తెలిపారు.

- Advertisement -