ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి..

25
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడోయాత్ర చేస్తున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రేవంత్ పాదయాత్ర కొనసాగుతుండగా నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ మైదానంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు.

అనంతరం కాసేపు రేవంత్ కూడా ఫుట్‌బాల్ ఆడి అలరించారు. విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. కాసేపు ఫుట్‌బాల్ ఆడిన అనంతరం ప్లేయర్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి కాసేపు మ్యాచ్‌ను వీక్షించారు. రేవంత్ స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి ఫుట్‌బాల్ ఆడటం అందరినీ ఆకట్టుకుంది. ఇక రేవంత్ ఫుట్ బాల్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఇటీవలె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్…తనకు ఫుట్ బాల్ అంటే ఇష్టమని తెలిపిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -