కువైట్‌లో ఎమ్మెల్సీ కవిత బర్త్ డే..

11
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత బర్త్ డే వేడుకలను కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. జాగృతి కువైట్‌ అధ్యక్షుడు ముత్యాల వినయ్‌ కుమార్‌ నేతృత్వంలో ఈ వేడుకలు జరుగగా ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్, ఎరుగట్ల జడ్పీటీసీ రాజేష్ గుల్లే, గోల్డెన్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాన్ సోహెల్, కువైట్ తెలంగాణ సమితి అధ్యక్షులు జీకే గంగాధర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ జాగృతి – కువైట్‌ ఇక నుంచి భారత్‌ జాగృతి-కువైట్‌గా మారిందన్న విషయాన్ని ఇతర రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలని జాగృతి సభ్యులకు సూచించారు. తెలంగాణ ప్రజలకు ఏ అవసరం ఉన్నా జాగృతి అండగా ఉంటుందని తెలియజేశారు.

ఎన్నో మహోన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ మన మూలాలు మరిచిపోవద్దనే సంకల్పాన్ని గట్టిగా నమ్మిన నాయకురాలు కవిత అని కొనియాడారు.కవితపై జరుగుతున్న రాజకీయ దాడులను ముత్యాల వినయ్‌ కుమార్‌ ఖండించారు. తప్పుడు కేసులతో కవితను ఇబ్బందులకు గురి చేస్తున్న దుష్టశక్తులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -