గ్రీన్ ఛాలెంజ్‌: మొక్కలు నాటిన ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి

103
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పరిగి కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి ప్రారంభించారు ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డి.

మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నదని విద్యార్థులు మరియు ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని సీతారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సతీమణి ప్రతిమ రెడ్డి,పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్,స్థానిక జడ్పిటిసి పట్లొల హరి ప్రియ, నియోజక వర్గ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మధుసూధన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -