సుప్రీంను ఆశ్రయిస్తా: నవనీత్ కౌర్

172
kaur
- Advertisement -

తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తానని తెలిపారు సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఈ దేశ పౌరురాలిగా బాంబే హైకోర్టు ఆదేశాన్ని గౌరవిస్తాను…కానీ అదే సమయంలో సుప్రీంను ఆశ్రయిస్తానని తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.

నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేశారు. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆరు నెలల్లోగా కులధ్రువీకరణకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను కోర్టు ముందుంచాలని ఆదేశించింది.

మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ విజయం సాధించారు. నవనీత్ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు.

- Advertisement -