కరోనాతో బీజేపీ ఎంపీ మృతి…

152
covid 19
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తునే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనాతో మృతిచెందగా తాజాగా బీజేపీ ఎంపీ నంద్‌ కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ గురుగ్రామ్‌ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మంగళవారం ఉదయం కన్నుమూశారు.

జనవరి 11న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుండి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఖండ్వ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నంద్‌కుమార్‌ స్వస్థలం నిమార్‌లోని బుర్హాన్‌పూర్‌ జిల్లాలోని షాపూర్‌. 1996లో షాపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు.

- Advertisement -