రంగనాయకసాగర్‌ కాల్వలో ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే

344
rasamai
- Advertisement -

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి ప్రత్యేక పూజలు చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.

ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటంతో సంబురంతో కాల్వ జలాలు ఏంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ నీళ్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూర్, నారాయణరావు పేట మండల ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువల్లో దూకి ఈత కొట్టారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్ సెల్ఫీలు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.

rasamai

- Advertisement -