రంగనాయకసాగర్‌ కుడి,ఎడమ కాల్వలకు నీటి విడుదల..

293
harish
- Advertisement -

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి ప్రత్యేక పూజలు చేశారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్… ఈ రోజు కోసం తరతరాలుగా రైతులు ఎదురు చూపులు చూశారని చెప్పారు.

కాలువల వెంట బిరబిరా గోదారమ్మ పరిగెడుతుంటే, రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు కారుతున్నాయని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇంత కాలం రైతులు, కరెంట్, కాలం మీద ఆధారపడి వ్యవసాయం చేశారు.. ఇక నుంచి కరెంట్, కాలంతో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే రోజులు వచ్చాయన్నారు.

ఒకనాడు ఈ ప్రాంతంలో కాలం అయితేనే రైతుల కడుపు నిండేది….ఇక నుంచి ఆత్మ హత్యలకు పుల్ స్టాఫ్, కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేస్తాం అన్నారు. 365 రోజుల పాటు రంగనాయక సాగరుకు నీళ్లు వస్తాయి కాబట్టి కరువుకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతున్నాం అన్నారు. కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లపై రైతులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవారు.. ఇక నుంచి రైతులు ఖచ్చితంగా రెండు పంటలు పండించుకునే శుభదినం వచ్చిందన్నారు.

నక్కవాగు, పెద్దవాగు కింద ఉండే చెక్ డ్యామ్ లు నింపుతాం…. మైనర్, సబ్ మైనర్ కాలువల తవ్వకాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. వర్షాకాలం వరకు పిల్ల కాలువలు పూర్తి చేసుకోవాలి..కాలువలు తవ్వడానికి ఇదే సరైన సమయం అన్నారు.

- Advertisement -