కాళేశ్వ‌రం వ‌ద్ద టూరిజం అభివృద్ధి చేయాలి- ఎంపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

169
MP Kotha Prabhakar Reddy
- Advertisement -

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. లోక్ స‌భ‌లో 377 నిబంధ‌న కింద ప్ర‌త్యేకంగా‌ ప్ర‌స్తావించారు టీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిపాదించి.. పూర్తి చేసింది. ఇక్కడ కొన్ని సదుపాయాలు కల్పిస్తే టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుంది అన్నారు. కాళేశ్వరం ఆలయం నుంచి లక్ష్మీ బరాజ్ వరకు 22 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంది.

వాటర్ ఫ్రంట్ నైట్ లైఫ్, క్రూజ్ బోట్స్, వాటర్ స్పోర్ట్స్, గ్లైడింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ మొదలైన ప్రాంతాలు కూడా పర్యటకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి దృష్టి సారించాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు.

- Advertisement -