ఇవాళ కేరళకు ఎంపీ కవిత…

266
mp kavitha
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ కవిత కేరళ వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ వజ్రోత్సవాల్లో భాగంగా నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించనున్నారు. కేరళ శాసనసభ వజ్రోత్సవాల సందర్భంగా కాస్ట్ అండ్ ఇట్స్ డిస్కౌంట్స్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు.

కేరళ అసెంబ్లీ వజ్రోత్సవ వేడుకలు ఈ నెల 23 నుండి 25 వరకు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ వేడుకలను ప్రారంభించనుండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ, పుణెకు చెందిన ఎంఐటీ పీస్ వర్సిటీ సంయుక్తంగా ఫెస్టివల్ ఆన్ డెమొక్రసీ పేరిట పలు జాతీయస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నాయి.

ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఎంపీ కవితను ఆహ్వానించారు కేరళ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్‌. ఈ కార్య‌క్ర‌మంలో కేర‌ళ సిఎం పినరయి విజయన్‌తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు దేశ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉన్న జాతీయ విద్యార్థులు ఈ స‌ద‌స్సులో పాల్గొననున్నారు.

- Advertisement -