తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం విజయ వంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మొక్కలు నాటారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్. హరితహారం కార్యక్రమానికి సహకరించినందుకు ఉపరాష్ట్రపతికి, గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,, జోగినపల్లి సంతోష్ కుమార్. రాబోయే తరాల కోసం మొక్కలు నాటాలనే స్పూర్తిని యువతలో నింపేలా సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Thank you respected @MVenkaiahNaidu garu and @DrTamilisaiGuv garu for being such a pillar of support as @IgnitingMindsin had come up with a great initiation to provide sustainable environment to the generations to come.#GreenIndiaChallenge#HaraHaiTohBharaHai pic.twitter.com/IGFFKw1bqC
— Santosh Kumar J (@MPsantoshtrs) September 22, 2019