చంద్రబాబు కాలుపెడితే…నాశనమే

247
mothkupalli chandra babu
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. చిత్తూరు పర్యటనలో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే కంటే దారుణమైన వ్యక్తి చంద్రబాబు అని ద్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్దిచెప్పాలన్నారు.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌తో పాటు ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరినీ చంపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు కాలు పెట్టిన ప్రాంతం నాశనమేనని దుయ్యబట్టారు. కాపులు,బీసీల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.

జీవితమంతా చంద్రబాబు కోసం త్యాగం చేశానని అలాంటి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. తాను తప్పుచేసి ఉంటే ముక్కు నేలకు రాసుకుంటానని సవాల్ విసిరారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్ బొమ్మ గుర్తొస్తుందని….అన్నా క్యాంటీన్లు ఎన్నికల స్టంట్‌ అని ఆరోపించారు. దళితుడిని కాబట్టే తనను అవమాన పరిచాడని…తాను పెద్దమాదిగ అని చెప్పుకనే చంద్రబాబు…తన సస్పెన్షన్‌కు కారణం చెప్పాలన్నారు.

- Advertisement -