తెలంగాణలో టీడీపీ భూస్థాపితం:మోత్కుపల్లి

232
mothkupalli
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో ద్వజమెత్తారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. తెలంగాణలో బాబు, పార్టీని నమ్ముకున్న వారు ఏమై పోవాలని నిలదీశారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి..చంద్రబాబు వెన్నుపోటు,మోసాలతో తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా పోయిందన్నారు.

చంద్రబాబు అవినీతి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం తన జీవితాన్నే ధారపోశానని కానీ చంద్రబాబు తనను నట్టేట ముంచేశారని దుయ్యబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత టీడీపీ జాతీయ పార్టీగా ఉంటుందని భావించానని కానీ కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాల,మాదిగలకు ఏమి చేయని చంద్రబాబు కాపులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మాల మాదిగలందరూ ఏకం అవుతున్నారని, 20 ఏళ్లుగా వర్గీకరణ చేయని ఆయన కాపులకు ఏం చేస్తారని ప్రశ్నించారు.

- Advertisement -