కేరళను తాకిన రుతుపవనాలు

321
monsoon kerala
- Advertisement -

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్యలో తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

రానున్న 48 గంటల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నదని పేర్కొంది.రుతుపవనాల రాకతో ఈ నెల 9, 10న కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

విపత్కర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. మత్య్సకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.

- Advertisement -