ఏపీ మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం..

305
ap cabinet swearing cermony
- Advertisement -

ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో శ్రీకాకుళం నుంచి మంత్రుల పదవీప్రమాణస్వీకారం ప్రారంభించారు. క్యాబినెట్‌లో చోటుదక్కిన నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్ తొలి మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌),కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎమ్మెల్యే పినిసే విశ్వరూప్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ వద్దకు వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు.

అంతకముందు ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకట అప్పలనాయుడు ప్రమాణం చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పలనాయుడుతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు.

- Advertisement -