ప్రముఖ సినీ నటుడు,డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది.ఆయన తల్లి మంచు లక్ష్మమ్మ(85) ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
లక్ష్మమ్మ పార్థివదేహాన్ని తిరుపతి నుంచి మోహన్ బాబు విద్యాసంస్థలు శాంతినికేతన్కు తరలించారు. మంచులక్ష్మమ్మ మరణంతో విద్యానికేతన్ ప్రాంగణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం కుటుంబసభ్యలుతో కలిసి విదేశాల్లో ఉన్న మోహన్ బాబు స్వదేశానికి బయలుదేరారు. రేపు ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయి.
నానమ్మ మరణవార్త విని తీవ్ర దిగ్బ్ఱాంతికి లోనయ్యారు మంచు మనోజ్. మా నానమ్మ లక్ష్మమ్మ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం నానమ్మ. ఈ సమయంలో నేను భారతదేశంలో లేకపోవడం బాధకలిగిస్తోందని పేర్కొన్నారు. లక్ష్మమ్మ అంత్యక్రియలకు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.