వార‌ణాసిలో ప్ర‌ధాని మోడీ వెనుకంజ‌

3
- Advertisement -

వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి అజ‌య్ రాయ్ 11480 ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉన్నారు. రెండో స్థానంలో ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడీ ఉన్నారు. ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఆయ‌న‌కు 5257 ఓట్లు పోల‌య్యాయి.

ఎన్డీఏ కూట‌మి 290 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ది. ఇండియా కూట‌మి 212 స్థానాల్లో దూసుకెళ్తున్న‌ది. దీంతో ఈ సారి పోరు హోరాహోరీగా క‌నిపిస్తున్న‌ది. తాజా ట్రెండింగ్ ప్ర‌కారం.. ఎన్డీఏ కూట‌మి మ్యాజిక్ మార్క్‌ను దాటినా.. కాంగ్రెస్ కూట‌మి కూడా ఎక్కువ స్థానాల‌నే గెలుచుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Also Read:6ix సినిమాస్…’వాట్ ది ఫిష్’

- Advertisement -