లాక్ డౌన్ కంటిన్యూపై మోడీ కీలకనిర్ణయం…!

282
modi with cms
- Advertisement -

కరోనా కట్టడికి దేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం అనంతరం కీలక నిర్ణయాన్ని వెలువరించనున్నారు.దీంతో లాక్ డౌన్ కొనసాగిస్తే ఎన్నిరోజులు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు చేపట్టి ఆ తర్వాత పొడిగించే ప్లానింగ్ లో ఉన్నారని సమాచారం. అత్యవసరసేవలు మినహాయించి స్కూళ్లు, కాలేజీలు, మతపరమైన సంస్థలు మూసే ఉంచనున్నారు.

అయితే ఇప్పటికే ఒడిశాతో పాటు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించేశాయి. ఒడిశాలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఇక భారత్‌లో ఇప్పటివరకు భారత్‌లో 6వేల 412కేసులు నమోదుకాగా, 199మృత్యువాత పడ్డారు. గడిచిన 24గంటల్లో 33మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -