- Advertisement -
గ్రామాలకు వైరస్ వ్యాపించకుండా చూసుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడిన పీఎం…గ్రామాలకు కరోనా వ్యాపించకుండా చూసుకోవడం పెద్ద సవాల్గా మారిందన్నారు.
ఇంటికి వెళ్లాలనుకున్న వారి ఆందోళనను అర్థం చేసుకుని ఎక్కడి వారు అక్కడ ఉండడమే ఉత్తమం అని ఆయన అన్నారు. స్వంత ఇంటికి వెళ్లాలనుకోవడం మానవ సహజమని, అందుకే కొన్ని రూల్స్ సడలించినట్లు ఆయన తెలిపారు.
కోవిడ్19 నుంచి ఇండియా తనను తాను రక్షించుకున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయని, అయితే వైరస్ నియంత్రణలో అన్ని రాష్ట్రాలు సహకరించినట్లు మోడీ తెలిపారు.
- Advertisement -