పవన్‌ తుపాన్..మోడీ ప్రశంసలు

8
- Advertisement -

ఎన్డీయే కూటమి భేటీలో జనసేన అధినేత పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు నరేంద్ర మోడీ. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయం సాధించలేదన్నారు. ఎన్డీయే కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతుందని చెప్పారు.

పవన్‌… ఒక తుపాన్ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీలో ఇంతటి ఘనవిజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షానికి ప్రజలు అధికారాన్నిచ్చారని చెప్పారు.దేశాన్ని నడపాలంటే అందరి అంగీకారం అవసరమని తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు శ్రమించారని అన్నారు. ఎన్డీఏ నేతలను చూస్తుంటే సుపరిపాలన గుర్తుకువస్తుందని చెప్పారు. దేశం కోసం ఈ కూటమికి ఎంతో నిబద్ధత ఉందని తెలిపారు.

ఎన్డీఏ నేతలు విజయం సాధించి ఇక్కడికి వచ్చారని తెలిపారు. 2019లో ఎన్డీఏను బలపర్చారని, ఇప్పుడు మరోసారి ఎన్డీఏను మిత్రపక్షాలన్నీ బలపర్చాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరమని చెప్పారు.

Also Read:14న చాందిని..యేవమ్

- Advertisement -