ఎన్డీయే పక్ష నేతగా మోడీ..

8
- Advertisement -

మూడోసారి ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికయ్యారు నరేంద్ర మోడీ. ఢిల్లీలో ఎన్డీఏ పక్ష పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగగా ఎన్డీయే పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోడీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, గడ్కారీ, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి, నితీష్ కుమార్ తదితర పక్ష నేతలు బలపర్చారు.

జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు నితీశ్ కుమార్, పవన్ కల్యాణ్, అజిత్ పవార్ తదితరులు హాజరయ్యారు. మోడీ విజన్ దేశానికి ఎంతో అవసరం అన్నారు చంద్రబాబు. ఎన్డీయేతోనే కలిసి నడుస్తామని చెప్పారు.

Also Read:గురకతో ప్రాణాలకే ప్రమాదమా?

- Advertisement -