ఇర్కోడులో మోడ్రన్ స్లాటర్ హౌస్..

51
- Advertisement -

సిద్దిపేట జిల్లాలో మంత్రి కేటీఆర్, హరీష్ రావు పర్యటిస్తున్నారు. తమ పర్యటన సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలు, శంకుస్ధాపనలు చేపట్టనున్నారు. సిద్దిపేట పట్టణ శివారు ఇర్కోడ్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడ్రన్‌ స్లాటర్‌ హౌస్‌ను ప్రారంభించారు.

అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్‌ నాన్‌వెజ్‌ పచ్చళ్లు, పంచాయతీరాజ్‌ శాఖ సేంద్రియ ఎరువుల స్టాళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జే పాటిల్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, తదితతలు పాల్గొన్నారు.

Also Read:కంటి చూపు కాపాడుకోండిలా !

అనంతరం సిద్దిపేట పట్టణంలో బీటీ, సీసీ రోడ్లకు, నర్సాపూర్‌ వద్ద గల కప్పలకుంట సుందరీకరణ పనులకు శకుస్థాపన చేశారు. నర్సాపూర్‌లో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన,స్వచ్ఛ బడిని సందర్శించనున్నారు. నాగులబండ వద్ద నిర్మించిన ఐటీ టవర్‌ ప్రారంభం అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని మంత్రులు ప్రసంగించనున్నారు.

- Advertisement -