పుట్టిన రోజున మొక్కలు నాటిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి..

171
MLC Palla Rajeshwar Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని రైతు బంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో రైతు బంధు సమితి చైర్మన్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈరోజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితతెలంగాణ స్వప్నం సాకారం దిశగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ అభినందనీయులు..దీని ద్వారా తెలంగాణ పచ్చని తెలంగాణ దిశగా ముందుకు వెళుతుంది. తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలుస్తుంది. హరితహరం స్పూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున కోటి వృక్షార్చన ఎలా విజయవంతం చేశామో అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజున ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతం చేస్తాం అని తెలిపారు.

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 24 న మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్ష అర్చన పోస్టర్‌ను రాజేశ్వర్ రెడ్డికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -