పుర పోరులో గెలుపు టీఆర్ఎస్‌దే:పల్లా

285
mlc palla
- Advertisement -

పుర పోరులో ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్‌దే అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు.

టీఆర్ఎస్‌ 90 శాతం సీట్లు కైవసం చేసుకుంటుందని.. పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకంతో ఓటు వేశారన్నారు.

మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పని తీరుకు లభించబోతు న్న విజయమిదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం కష్టపడిన ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -