పేద విద్యార్థులకు అండగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్..

151
mlc naven
- Advertisement -

పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ’గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ పిలుపులో భాగంగాఎమ్మెల్సీ కె.నవీన్‌కుమార్‌ తన వంతు సహాయాన్ని అందించారు. పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత చదువులకు పేదరికం అడ్డువచ్చిన ఆ కుటుంబాలకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు.

నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రవీణ్‌కుమార్‌, శ్రీహర్ష, హేమ, రక్షితలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కూకట్‌పల్లిలోని కార్యాలయంలో ఆ విద్యార్థులకు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ నగదును అందించారు. ఎమ్మెల్సీతో పాటు గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకుడు పాటిమీది జగన్మోహన్‌ రావు ఉన్నారు. ఉన్నత చదువులకు ప్రోత్సహించినందుకుగానూ విద్యార్థులు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -