శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్సీ కవిత..

122
ttd kavitha
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి నజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను క‌విత దంప‌తుల‌కు అందజేశారు.

కాలినడకన తిరుమల కొండ ఎక్కారు కవిత. అనంతరం మాట్లాడిన కవిత…స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని నిజపాదసేవలో దర్శించుకుని,మొక్కులు చెల్లించుకున్నాను. ఏడు కొండల స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

- Advertisement -