నాయిని నరసింహ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత నివాళి..

213
mlc kavitha
- Advertisement -

హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో మాజీ హోంమంత్రి నాయిని నరసింహ రెడ్డి,వారి సతీమణి అహల్య దశ దిన కర్మ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని వారికి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. హోంమంత్రి నాయిని నరసింహ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నాయిని మరణించిన కొద్ది రోజులకే ఆయన సతీమణి నాయిని అహల్య కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో నాయిని కుటుంబానికి పలువురు సతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -