ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

154
minister puvvada
- Advertisement -

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సిద్దారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం సిద్దారం పంచాయతీలో రూ.12.60 లక్షలతో నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామం, రూ.2.50 లక్షలతో నిర్మించిన కంపోస్టు షెడ్‌ను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించడమైనది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె పకృతి వనం కావాలని పిలుపునిచ్చారు. పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రజల తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలను సంరక్షించి వాటిని మరింత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ చైర్మన్ మహేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -