బర్త్ డే….మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కవిత

185
kavitha
- Advertisement -

తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు ఈరోజు తన జన్మదినం సందర్భంగా నేడు ప్రగతి భవన్ లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి మొక్కలు నాటారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ ఈ పుట్టినరోజు రోజు ఎప్పటికీ మర్చిపోలేనిది అని మా అమ్మ , అన్నయ్య సంతోష్ తో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తు పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తు ఈరోజు నాచేత మొక్కలు నాటించి నా పుట్టిన రోజుకు మంచి బహుమతి గా అందించావు అని…. ఇది ఎప్పటికీ మరిచిపొలేని మధుర జ్ఞాపకం గా ఉంటుంది అని ఈ సందర్భంగా సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -