దీక్షా దివస్ స్పూర్తితో బంగారు తెలంగాణ: ఎమ్మెల్సీ కవిత

145
kavitha
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో పదకొండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారని గుర్తు చేశారు.

యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమై కేసీఆర్‌కు అండగా ఉండాలని ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ సమాజం యావత్తు వెంట నిలవడంతో.. కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

- Advertisement -