ఒక్క మీడియా సమావేశం లేదు:మోడీపై కవిత సెటైర్

71
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సెటైర్ వేశారు ఎమ్మెల్సీ కవిత. పటాన్ చెరులోని‌ జీఎంఆర్‌ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ద్వితీయ మహాసభలు& ఇండియన్ జర్నలిస్టు యూనియన్ ( ఐజేయూ) 10 వ ప్లీనరీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత…జర్నలిస్టుల సంక్షేమం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్దిని వివరిస్తూనే ప్రధాని మోడీ తీరును ఎండగట్టారు. కొన్ని సంస్థలు కావాలనే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇలాంటి కుట్రల పట్ల జర్నలిస్టులు సైతం ఆలోచించాలలన్నారు. గత తొమ్మిదేండ్లలో ప్రధాని మోదీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదని దీనిపై ఒక్క జర్నలిస్టు యూనియన్ కూడా ప్రశ్నించలేదన్నారు.

సీఎం కేసీఆర్ వందలాది మంది జర్నలిస్టులతో మీడియా సమావేశం నిర్వహించి, విలేఖరులు అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతూ, సమస్యలకు పరిష్కారం చూపిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నేతలకు పారదర్శకత, నిబద్దత ఉండాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జర్నలిస్టులకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లుగానే, కేంద్ర ప్రభుత్వం సైతం జర్నలిస్టులకు నిధులు కేటాయించేలా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. జర్నలిస్టుకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరులు సీఎం కేసీఆర్తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. మీడియా సంస్థల విశ్వసనీయతతో పాటు, ప్రసారం చేస్తున్న వ్యక్తులకు సైతం నిబద్దత ఉన్నప్పుడే, ప్రసారం చేసే వార్తల పట్ల విశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -