ఇక రణమే.. పవన్ సమరశంఖం !

125
- Advertisement -

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన యమ దూకుడుగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని ఉవ్విళ్లూరుతున్న జనసేనాని.. వేస్తున్న ప్రతి అడుగు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. వైఎస్ జగన్ ను గద్దె దించడమే లక్షంగా పవన్ అనుసరిస్తున్న వ్యూహాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. జగన్ పాలనపై ముఖ్యంగా రోడ్ల విషయంలో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో పవన్ ఆ మద్య చేపట్టిన ‘ గుడ్ మార్నింగ్ సి‌ఎం సార్ ‘ అనే డిజిటల్ క్యాంపైన్.. జనసేనకు మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ఇక జనవాణి పేరుతో ప్రజా సమస్యలను బహిర్గతం చేస్తూ పవన్ చేపట్టిన కార్యక్రమంపై కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. .

రైతు భరోసా యాత్ర, కౌలు రైతులకు సాయం వంటి కార్యక్రమాలు కూడా ప్రజల దృష్టి జనసేనపై పడేలా చేశాయి. ఇక ఇప్పుడు పవన్ యువతపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న శ్రీకాకులం జిల్లాలో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు పవన్.. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ జగన్ పరిపాలనలో యువత ఎదృకొంటున్న సమస్యలను బహిర్గతం చేయనున్నారు. యువతకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయకపోవడం, నిరుద్యోగులపై పోలీసుల దాడులు వంటి సమస్యలను ప్రస్తావించనున్నారు పవన్.. ఈ నేపథ్యంలో యువత మాటలు వినడానికి ఎదురు చూస్తున్న అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే జనవాణి కార్యక్రమం ద్వార ప్రజా సమస్యలను బయటపెడుతూ వైసీపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పవన్.. యువశక్తి వైసీపీకి ఇంకెలాంటి షాక్ ఇస్తారో చూడాలి. మొత్తానికి పవన్ అనుసరిస్తున్న వ్యూహాలు, వెస్తోన్న ప్రణాళికలు జనసేనకు మంచి బూస్టప్ తీసుకొస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -