మోదీపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు..

73
- Advertisement -

దేవుడి పేరుతో రాజకీయం చేస్తే భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఎమ్మెల్సీ కవిత. వాళ్లు జై శ్రీరాం అంటే మనం జై హనుమాన్‌ అనాలని అమె అన్నారు.. శనివారం జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని, ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోదీ హైతో ముష్కిల్‌ హై.. పాతాల్ మే జీడీపీ హై.. ఆస్మాన్‌మే బే రోజ్‌గార్ హై.. అని ప్రధానిని విమర్శించారు. మోదీ హయాంలో పెట్రోల్ నుంచి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయని కవిత ధ్వజమెత్తారు.

- Advertisement -