మాణిక్కం ఠాగూర్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

47
kavitha
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌పై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత. సీఎం కేసీఆర్ ఊసరవెల్లి అంటూ ఠాగూర్ ట్వీట్ చేయగా దానిని రీట్వీట్ చేస్తూ ఊసర వెల్లికి కేసీఆర్ రోల్ మోడల్ అంటూ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాల‌ని ఠాగూర్‌కు క‌విత సూచించారు.

దీనిపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు. అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని క‌విత పేర్కొన్నారు.

- Advertisement -