MLC Kavitha:జై తెలంగాణ ఎందుకు అనరు?

69
- Advertisement -

రాహుల్ గాంధీ ఒక్కసారైనా జై తెలంగాణ? అని ఎందుకు అనరని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన ఆమె…పదేండ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు. సోనియా, రాహుల్‌ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:BRS:కేంద్రంలో బి‌ఆర్‌ఎస్ సత్తా..నో డౌట్!

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా …ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికి రాహుల్ గాంధీకి అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం అన్నారు.

- Advertisement -