కార్తీక సోమవారం..ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత

150
kavitha
- Advertisement -

కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌లోని శివాలయానికి వెళ్లిన కవిత శివునికి అభిషేకం చేశారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. పెద్దఎత్తున కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

- Advertisement -