టీఆర్ఎస్ ఎన్నారైల సేవలు మరువలేనివి: ఎమ్మెల్సీ కవిత

238
mlc kavitha
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ను శనివారం టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, ఎన్నారై టీఆర్ఎస్ సలహాదారు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ముందుగా విదేశాలలో ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రమాదాలలో మన ఎన్నారై టీఆర్ఎస్ కార్యకర్తలని కోల్పోయాం, వారికి ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తూ, వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. వచ్చే ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంది, అందరూ మెంబర్ షిప్ డ్రైవ్‌ను చురుకుగా చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టభద్రుల ఎలక్షన్స్ రాబోయే రోజులలో ఉన్నందున ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి. ఎన్నో సమస్యలను పల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. అలాగే హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్. వాణీదేవిని గెలిపించాల్సిందిగా కోరారు. వాణీదేవి మాజీ ప్రధాని పీవీ కూతురు, విద్యావేత్త. అలాగే 30 ఇయర్స్ విద్యా రంగంలో ఉన్నారు. పల్లా మరియు వాణి దేవి గెలుపుకి కృషి చెయ్యాలని, ప్రచారంలో టీఆర్ఎస్ ఎన్నారై శ్రేణుల పాత్ర ఉండాలని కవిత కోరారు. ఈ ప్రోగ్రాం చేసినందుకు మహేష్ బిగాలని అభినందించారు.

ఈ మధ్య కాలంలో ఎన్నారై శాఖలలో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ రెండు సంవత్సరాలు పూర్తి చేసినందుకు సౌత్ ఆఫ్రికా శాఖ మరియు మిగతా దేశాల శాఖలకు శుభాకాంక్షలు తెలిపారు. సౌత్ ఆఫ్రికా శాఖ చేస్తున్న సహాయ కార్యక్రమాలను కొనియాడారు. మన బాధ్యతగా పల్లా , వాణిని మనకు తెలిసిన వాళ్ళకి పరిచయస్తులని ఓటు గురించి కోరాలని కోరారు. బీజేపీ చేస్తున్న అబద్ధాలని పటాపంచలు చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని రకాలుగా సాక్షాలతో సహా తిప్పి కొడుతున్నారు. ఈ ఎలక్షన్ ప్రచారాన్ని గమనించినట్టు అయితే టీఆర్ఎస్ సభ్యులే గెలిచే అవకాశం వుంది. మహేష్ బిగాలకి, అన్ని దేశాల ఎన్నారై లీడర్స్ కు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న మన కార్యకర్తలందరికీ డేటా ఇచ్చి బీజేపీ చేసే అబద్దాలను తిప్పికొట్టాలని కవిత కోరారు. ఈ రాబోయే 5 రోజులలో గట్టిగా ప్రచారం చేసి గెలుపుకు కృషి చెయ్యాలని కోరారు. ఏప్రిల్ 27 తెరాస ప్లినరీకి ఎన్నారైలు వచ్చే అవకాశం ఉంటే పిలవాలని చెప్పారు.

మహేష్ బిగాల మాట్లాడుతూ.. న్యూజెర్సీలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధి – శ్రీ దేవేందర్ రెడ్డి నల్లమడ, టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా- జాయింట్ సెక్రటరీ – శ్రీ రమణ రెడ్డి కంకనాల, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్- సత్యం గురిజపల్లి లకు నివాళులు అర్పించారు. మహేష్ బిగాల ఆయన సభ్యత్వాన్ని తీసుకొని, అన్ని టీఆర్ఎస్ శాఖల కార్యకర్తలకు టీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అన్ని దేశాల ప్రతినిధులను ఏప్రిల్ 27 నాడు పాల్గొనే విదంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని, వాణీదేవిని గెలిపించాలని కోరారు. ఎన్నారైలు ప్రచారంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసారు .

ఈ కార్యక్రములో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొని, ప్రసంగించి అందరూ సూచనలు చేస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -