లుక్ ఈస్ట్ పాలసీతో ఐటీ విస్తరణ:కవిత

221
kavitha mlc
- Advertisement -

ఐటీ రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్‌లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన ‌కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ కంపెనీలు విస్త‌రిస్తున్నాయ‌ని తెలిపారు. ఉప్పల్ కారిడార్‌లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పే దిశగా మంత్రి కేటీఆర్ యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కంపెనీలో దాదాపు 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

- Advertisement -