పద్య ప్రక్రియను అమితంగా ‌ఇష్టపడే నాయకులు సీఎం కేసీఆర్: కవిత

232
mlc kavitha
- Advertisement -

జాతీయత మనందరికీ ఆత్మ వంటిదని, సాహిత్య ప్రక్రియల ద్వారా జాతిని అభ్యుదయం వైపు నడిపించే విధంగా ఆలోచనలు చేయాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ‘మెతుకు ‌సీమ సాహితీ‌ సాంస్కృతిక సంస్థ- సంగారెడ్డి’ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తు సమావేశ మందిరంలో 610కవుల భాగస్వామ్యంతో ‘పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్సంకలనం ఆవిష్కరణోత్సవం’లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ప్రజలను, పద్యాలను సమాన స్థాయిలో ‌ప్రేమించే నాయకులు సీఎం కేసీఆర్ గారన్న ఎమ్మెల్సీ కవిత, వారి స్పూర్తితో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ వారు ‘తెలంగాణం’ పేరుతో పద్య కవితా సంకలాన్ని రూపొందించారని తెలిపారు. పద్య ప్రభంజనంలో ప్రతి పద్యంలో జాతీయత ఉట్టిపడుతోందన్న ఎమ్మెల్సీ కవిత, ఇది ఒక జాతీయ కావ్యంగా నిలిచిపోవాలన్నారు‌. నాటి పోతన నుండి ప్రతాపరెడ్డి వరకు, తెలంగాణ అంటే ధిక్కారాన్ని చూపించిన నేల తెలంగాణ అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఆనాటి ‘గోల్కొండ కవుల సంచిక’ను తెలంగాణ ఉద్యమ సమయంలో పునర్ముద్రించే అదృష్టం తెలంగాణ జాగృతి కే దక్కిందన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ‌ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ గ్రూప్ 1 ఆపీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి డా. ఏనుగు నరసింహ రెడ్డి, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, మెతుకు సీమ అధ్యక్షులు పూసల లింగాగౌడ్, పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -