- Advertisement -
రైతులకు ద్రోహం చేస్తే బీజేపీకి మనుగడ ఉండదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత…రాష్ట్రప్రభుత్వం రైతు మద్దతు చర్యలతో తెలంగాణ హరిత ప్రదేశంగా మారిందని చెప్పారు రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని…ధాన్యం సేకరణ కేంద్ర పభ్రుత్వ బాధ్యత అని చెప్పారు.
ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతున్నదని విమర్శించారు.
- Advertisement -