రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు..

54
bhadrachalam
- Advertisement -

రెండేళ్ల తర్వాత భక్త జనసంద్రోహం మధ్య రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది .శ్రీరామ నామ స్మరణతో మార్మోగిపోతోంది.

మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌‌, సత్యవతి రాథోడ్‌ ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందించారు.

కరోనా నేపథ్యంలో గత రెండేండ్లు ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -