చెన్నైకి ఎమ్మెల్సీ కవిత..

36
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించనున్న “ద సదరన్ రైసింగ్ సమ్మిట్”లో పాల్గొంటారు. సమ్మిట్ లో “సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ?” అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి జరిగే చర్చ వేదికలో పాలుపంచుకుని కవిత తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు.

ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నమలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

Also Read:Jr NTR:దేవర స్టోరీ లైన్ అదేనా?

- Advertisement -