తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది బీఆర్ఎస్. ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో మిగితా పార్టీలకంటే ముందంజలో ఉన్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్ మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు, కవిత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా దూసుకుపోతున్నారు కవిత. నిన్న స్కూటీపై ప్రయాణించిన కవిత…ఇవాళ స్వయంగా ఆమే కారు డ్రైవ్ చేస్తు ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త తరపున ప్రచారం నిర్వహించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ బోధన్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయటానికి ర్యాలీగా వెళ్లారు. కానీ ఆమె కారులో వెళ్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా కారు దిగి స్కూటీపై ప్రయాణించారు. ఓ సామాన్యురాలిగా కవిత స్కూటీపై వెళ్తుండటం చూసి ఆమెకు అభివాదం చేసేందుకు పోటీపడ్డారు.
Also Read:కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది:నీలం మధు