జోగులాంబ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబం..

139
- Advertisement -

ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. గద్వాల జిల్లాలోని అలంపురంలో గల శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ సతీమణి శ్రీమతి శైలిమ మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు అబ్రహం, వెంకటేశ్వర్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -