కాంగ్రెస్‌ నాయకులవి పనికి మాలిన దీక్షలు..

241
MLC Balasani Laxminarayana
- Advertisement -

నీళ్లు లేక రైతుల పంటలు ఎండితే జలదీక్ష చేయాలి..మంచి నీళ్లు లేకపోతే నిరసన చేస్తే అర్థముంటుంది..మండు వేసవిలో నిండు చెరువులున్న తెలంగాణలో ఈ అర్థం లేని జల దీక్షలు ఏంది ..?? నలుగురు, ఐదుగురు లేని చోట నీళ్ల మీద భట్టి వాటర్ ప్రజంటేషన్ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.

ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఈరోజు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ నాయకుల తీరుపై మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ డ్రామాలప ఏంటో అర్థం కావు..రాజీవ్ సాగర్ , ఇందిరా సాగర్ పేరుతో రుద్రమకోట దగ్గర బొక్కిన 12 వందల కోట్లలో భట్టి గారి వాటా ఎంత ..?? అని బాలసాని ప్రశ్నించారు.

తెలంగాణలో నీళ్లు పారుతుంటే.. కళ్లున్న కొందరు కబోదులు చూడలేకపోతున్నారని ఎద్దేవ చేశారు.కాంగ్రెసు నేతలు అభివృద్ది నిరోధకులు. నీళ్లు కావాలని ఎవరు అడగలేదు, విత్తనాలు, ఎరువులు కొరవలేదు . అయినా కాంగ్రెస్‌ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారు. ఇవి సోయి లేని దీక్షలు, బుద్ది లేని దీక్షలు.. పనికి మాలిన దీక్షలు.. అని ఎమ్మెల్సీ బాలసాని విమర్శించారు.

- Advertisement -